Author Archives: Admin

జన్నతుకు 4 అడుగులు

ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే. మరణం అన్నది అందరు తప్పనిసరిగా పొందబోయే ఈలోకములోని చివరి అనుభవం. అయితే, మరణముతరువాతి జీవితముకొరకు ఏకొద్దిమందో సిద్ధపడటము జరుగుతుంది. ‘చావు అనేది నాకు ఇప్పుడే రాదు’ లేక ‘చావు గురించి నేను యిప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు’ అన్న దృక్ఫథంతో ప్రతివ్యక్తీ జీవిస్తూ వుండటం సహజం.

రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి. ఈ లోకంలోని జీవితకాలాన్ని మరణంతరువాత గడుపబోయే కాలంతో పోలిస్తే అది లేశమాత్రమే నన్నది మరచిపోకూడదు.

ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలు ఘోషిస్తున్నాయి, “నేడే అనుకూలసమయం, నేడే రక్షణదినం!”

సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2)

మరణం తరువాత రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానిలో ప్రతివ్యక్తీ తన నిత్యత్వాన్ని గడపాలి. జన్నత్ (جنت) మరియు జహన్నం (جهنم). జన్నత్ అన్నది పరదైసు, జహన్నం అన్నది నరకం. జన్నతులోకి ప్రవేశించడానికి మన స్వంత నీతి (స్వనీతి) సరిపోదు. అలాగే, స్వంత ప్రయత్నాలతోకూడిన మన మతనిష్ఠకూడా సరిపోదు. అందుకు సరిపోయింది కేవలం సృష్టికర్తే నరులకొరకై నిర్ధేశించిన నాలుగు ఆత్మీయ అడుగులు!

జన్నతులోనికి ప్రవేశించే అర్హతను సిద్ధపాటును అందించే ఆ నాలుగు అడుగులను గురించిన వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింకును నొక్కండి…

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మొదటి అడుగు…

[జన్నతులోనికి (మోక్షంలోకి) ప్రవేశించడానికి వేయాల్సిన నాలుగు (ఆత్మీయ) అడుగుల విశయములో మీకు సందేహాలున్నా లేక ఇంకా స్పష్టత కోరుతున్నా క్రింద ఉన్న కామెంటు బాక్సుద్వారా నైనా లేక మా Email ID <[email protected]> ద్వారానైనా మాకు వ్రాయండి.]

శుభవార్త!

ఈ లోకములో అశాంతికి అరిష్టాలకు గురి అవుతూ నిరుత్సాహలో ఉన్నారా…?

దురలవాట్లకు మరియు దుష్టక్రియలకు జీవితములో బానిసలై మీరు కష్టపడుతున్నారా…?

జీవితములోని విరక్తిచేత లేక జిన్నులనబడే దురాత్మలచేత మానసిక వేదనను అనుభవిస్తున్నారా…?

రాబోవు లోకములో పాపుల కొరకు సిద్ధపరచబడిన నరకయాతనను తప్పించుకోలేను అని భయపడుతున్నారా…?

భయపడకండి! వీటన్నిటినుండి మీకు విడుదలను అందించే ఒక శుభవార్తను దేవుని [الله‎/אֱלֹהִ֑ים/Θεὸς/God] తరపున మీ ముందుంచుతున్నాము. ఈ శుభవార్తను ఆసాంతం చదివి గ్రహించి పాటించి దేవుని మేళ్ళు పొందండి…

(1) దేవుడు అద్వితీయుడు. ఆయన ద్వితీయములేనివాడు అంటే ఆయనలాంటివాడు ఆయనను పోలినవాడు ఆయనకు సాటిగా, పోటిగా, ధీటుగా మరొక దేవుడు లేడు. ఆయనే సమస్థాన్ని సృష్టించి కొనసాగిస్తూ సమ్రక్షిస్తూ పోశిస్తున్నవాడు. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధమైనవాడు, న్యాయతత్వమున్నవాడు, అంతేగాక ఆయన ప్రేమాస్వరూపుడు.

(2) మానవులందరము మనకివ్వబడిన నిర్ణయస్వేచ్ఛను బట్టి సృష్టికర్తకు వ్యతిరేకమైన తలంపులు, మాటలు, చేతలద్వారా పాపములో పడి అపవిత్రులుగా మారాము. ఈ కారణాన్నిబట్టి పరిశుద్ధుడైన దేవునికి మరియు ఆయన సన్నిధికి మనమందరము దూరపరచబడ్డాము.

సృష్టికర్త సన్నిధికి దూరపరచబడటమేగాక ఆయన న్యాయతత్వాన్ని బట్టి మనమందరము ప్రళయదినపు తీర్పునుబట్టి తగిన శిక్షను నరకములో పొందబోతున్నాము.

అయితే, ప్రేమాస్వరూపుడైన సృష్టికర్త ఎవరూ నశించటము యిచ్చయించక తన నిత్యసంకల్పములోని బృహత్ప్రణాళికను అనుసరిస్తూ మానవాళికి క్షమాపణ శాంతి మోక్షాలతోకూడిన రక్షణ మార్గాన్ని తానే సిద్ధం చేసాడు.

(3) దేవున్ని చేరటానికి, ఆయన ఎదుట నీతిమంతులుగా లెక్కించబడటానికి, మరణించిన తదుపరి మోక్షాన్ని పొంది నిత్యత్వమంతా దేవుని సన్నిధిలో పరలోక దూతలవలె నిత్యజీవాన్ని అనుభవించటానికి దైవ గ్రంథాలు సూచిస్తున్నదాని ప్రకారం రెండే మార్గాలు ఉన్నాయి. అవి:

i. స్వంత ప్రయత్నాలతో సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఙలకు పరిపూర్ణంగా లోబడి ఏపాపము చేయకుండా నీతిమార్గములోనే బ్రతికిన దినాలన్నీ జీవించగలగాలి. అలా జీవించగలిగిన వ్యక్తే పరిశుద్ధునిగా లెక్కించబడి తన నీతిని బట్టి మోక్షాన్ని పొంది దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలడు.
[కాని, మానవమాత్రులెవరూ ఈ విధానములో మోక్షం పొందిన దాఖలాలు లేవు. ప్రవక్తలుకూడా ఎప్పుడో ఒకప్పుడు పాపముచేసినవారే!]

ii. దేవుడే సిద్ధపరచిన మోక్ష కార్యాన్ని విశ్వసించి ఆ మార్గాన్ని అనుసరించాలి. ఈ రకమైన విశ్వాసములోని వచ్చిన ప్రతి వ్యక్తి ఎంతపాపియైనా పరిశుద్ధునిగా తీర్చబడి దేవుడే ఆపాదించే నీతిని పొంది తద్వారా ఆ వ్యక్తి మోక్షాన్ని స్వతంత్రించుకొని దేవుని సన్నిధిలో నిత్యత్వాన్ని గడపగలడు లేక గడపగలదు.

(4) దేవుడొక్కడే! అలాగే దేవునికి మరియు నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆ మధ్యవర్తి పేరు ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు]. దేవుడే తన న్యాయతత్వం మరియు ప్రేమాతత్వాలను బట్టి సంకల్పించి నిర్వర్తించిన ఈసా మసీహ్ వారి శ్రమలు, మరణం, మరియు పునరుత్థానాలద్వారా మానవాళికంతా సరిపోయే మోక్షమార్గాన్ని సిద్ధపరచాడు. ఈ మార్గములోకి ప్రవేశించటానికి కావలసింది స్వంత నీతినిపై, స్వంత భక్తిపై ఆధారపడకుండా పశ్చత్తాప హృదయముతో దేవుడు ఈసా మసీహ్ ద్వారా చేసిన కార్యాన్ని విశ్వసించి ఆయనద్వారా దేవునికి హృదయాన్ని మరియు జీవితాన్ని సమర్పించుకోవటం! 

(5) ఈసా మసీహ్ ద్వారా దేవుని మోక్షమార్గములో ప్రవేశించటం అన్న అద్భుతమైన అనుభవం కేవలం యదార్థంగా పశ్చత్తాప హృదయముతో దేవుని యెదుట వ్యక్తిగతంగా మీరు చేసే ప్రార్థనతో మొదలవుతుంది. ఈ ప్రార్థనను మీరు మీ స్వంత మాటలతో ఎక్కడ ఎప్పుడు ఏభాషలో చేసినా దేవుడు ఆలకించి మిమ్మును క్షమించి పవిత్రపరచి మీకో నూతన జీవితాన్ని అనుగ్రహించి తన ఆత్మీయ కుటుంభములో చేర్చుకుంటాడు.

పై విధానములో దేవుని బిడ్డలుగా మారిన మీరు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును [తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్] ధ్యానిస్తూ అందులోని బోధల ప్రకారం దేవుని కుటుంభములో ఇదివరకే చేరిన నిజమైన విశ్వాసులతో కలిసి దేవుని మార్గములో కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఈ ప్రయాణములో దేవుడు [الله‎/אֱלֹהִ֑ים/Θεὸς/God] మీకు తన ఆత్మ శక్తి చేత జయజీవితాన్ని అనుగ్రహిస్తాడు. అటుపిమ్మట, ఈ లోకాన్ని విడిచిన వెంటనే మిమ్మల్ని పరదైసులోని తన సన్నిధికి చేర్చుకుంటాడు. 

ఈ విశయములో మీకు సందేహాలున్నా లేక యింకా వివరాలు తెలుసుకోవాలనుకున్నా మాకు వ్యక్తిగతంగా వ్రాయండి…
మా E-mail: [email protected]

సృష్టికర్త మిమ్మల్ని దర్శించి కనికరించి మీకు క్షమాపణ, శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించి ఆశీర్వదించును గాక!

జన్నతుకు నాలుగు అడుగులు

ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే. మరణం అన్నది అందరు తప్పనిసరిగా పొందబోయే ఈలోకములోని చివరి అనుభవం. అయితే, మరణముతరువాతి జీవితముకొరకు ఏకొద్దిమందో సిద్ధపడటము జరుగుతుంది. ‘చావు అనేది నాకు ఇప్పుడే రాదు’ లేక ‘చావు గురించి నేను యిప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు’ అన్న దృక్ఫథంతో ప్రతివ్యక్తీ జీవిస్తూ వుండటం సహజం.

రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి. ఈ లోకంలోని జీవితకాలాన్ని మరణంతరువాత గడుపబోయే కాలంతో పోలిస్తే అది లేశమాత్రమే నన్నది మరచిపోకూడదు.

ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలు ఘోషిస్తున్నాయి, “నేడే అనుకూలసమయం, నేడే రక్షణదినం!”

సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2)

మరణం తరువాత రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానిలో ప్రతివ్యక్తీ తన నిత్యత్వాన్ని గడపాలి. జన్నత్ (جنت) మరియు జహన్నం (جهنم). జన్నత్ అన్నది పరదైసు, జహన్నం అన్నది నరకం. జన్నతులోకి ప్రవేశించడానికి మన స్వంత నీతి (స్వనీతి) సరిపోదు. అలాగే, స్వంత ప్రయత్నాలతోకూడిన మన మతనిష్ఠకూడా సరిపోదు. అందుకు సరిపోయింది కేవలం సృష్టికర్తే నరులకొరకై నిర్ధేశించిన నాలుగు ఆత్మీయ అడుగులు!

జన్నతులోనికి ప్రవేశించే అర్హతను సిద్ధపాటును అందించే ఆ నాలుగు అడుగులను గురించిన వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింకును నొక్కండి…

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మొదటి అడుగు…

[జన్నతులోనికి (మోక్షంలోకి) ప్రవేశించడానికి వేయాల్సిన నాలుగు (ఆత్మీయ) అడుగుల విశయములో మీకు సందేహాలున్నా లేక ఇంకా స్పష్టత కోరుతున్నా క్రింద ఉన్న కామెంటు బాక్సుద్వారా నైనా లేక మా Email ID <[email protected]> ద్వారానైనా మాకు వ్రాయండి.]

నాలుగవ అడుగు

నిజదేవుడు పంపిన లోకరక్షకుని ప్రబోధాలలో మాదిరిలో జీవించాలి [Live according to the teachings and life-examples of the Savour of the World sent by true God]

మానవాళికి యివ్వబడిన సంపూర్ణ దైవ ప్రత్యక్షతతోకూడింది బైబిలు గ్రంథం. తవ్’రాత్, జబూర్ వంటి దైవ గ్రంథాలతో కూడిన బైబిలులోని చివరి భాగం అల్-ఇంజీల్. మనుషులకు నిజదేవుని తరపున యివ్వబడిన చివరి గ్రంథం ఇంజీల్. ఈ గ్రంథములోనే జన్నతును చేరెందుకు మానవులు వేయాల్సిన నాలుగు అడుగుల వివరణ వుంది. ఇందులోనే మానవాళి రక్షణకై సృష్టికర్త చేసిన ప్రేమాత్యాగపు చరిత్ర లిఖించబడివుంది. ఆ దైవత్యాగపు ప్రత్యక్షతగా విచ్చేసిన లోకరక్షకుడు ఈసా అల్-మసీహ్ సాధించిన కార్యసాఫల్యం, ఆయన చేసిన బోధలు మరియు ఆయన చూపిన మాదిరి ఇంజీల్ మనకు అందిస్తున్నది.

జన్నతుకు (మోక్షం) వెళ్ళే అర్హతను సంపాదించే ప్రయత్నములో మొదటి మూడు అడుగులు చేసిన వ్యక్తులు ఆస్థితిలో ఈ లోకాన్ని వదిలితే వారు తిన్నగా జన్నతులోకి ప్రవేశిస్తారు. దీనికిగల కారణం వారు తమ స్వనీతిని ఆధారం చేసుకోక తమ స్వంతమతనిష్ఠపై ఆధారపడక లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ నందు దేవుడే చేసిన మోక్షకార్యంపై విశ్వాసముద్వారా ఆధారపడ్డారు.

అయితే, లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ ద్వారా నిజదేవుని ప్రజలుగా మారిన వ్యక్తులు ఈలోకములో ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఇతరులకు కూడా నాలుగు అడుగులలో ఉచితముగా పొందబోయే దేవుని కృపావరాన్ని గూర్చిన సమాచారాన్ని అందించాలి. అయితే, ఈరకంగా క్రొత్త జీవితములోకి ప్రవేశించిన వ్యక్తులు తిరిగి పాత జీవితవిధానానికి మరలకూడదు. క్రొత్త జీవితములో ఈసా అల్-మసీహ్ వారి బోఅధల ప్రకారం మరియు ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించాలి. ఇది మన స్వంత శక్తితో చేయలేనిది. దీనికి సృష్టికర్తే తన ఆత్మద్వారా ఆ శక్తిని మనకు అందిస్తాడు. ఇది ఆయన చేసిన వాగ్ధానం.

విశ్వాసముతో పశ్చత్తాప హృదయముతో క్షమాభిక్షను వేడుకుంటూ మొదటి మూడు అడుగులు వేసిన మనకు ఈసా అల్-మసీహ్ యొక్క పరిశుద్ధ రక్తములో మన పాపాలను కడిగి మనను పవిత్ర పరచి సృష్టికర్త మనకు పరమతండ్రిగా దగ్గరయ్యాడు. కేవలము ఈసా అల్-మసీహ్ కార్చిన వెలలేని పవిత్ర పరిశుద్ధ రక్తాన్నిబట్టే మన గత వర్తమాన మరియు భవిశ్యత్తు పాపాలను దేవుడు క్షమిస్తాడు. అయితే గమనించాలి, దేవుడు క్షమిస్తాడు గనుక పాపము చేద్దామని పథకరచనతో చేసే పాపాలనుబట్టి మనకు నిజమైన పశ్చత్తాపము కలుగదు గనుక అలాంటి పాపాలకు దేవుని క్షమాపణనుకూడా పొందలేము.

నాలుగవ అడుగుగా దేవుని కుటుంభములో చేరి దేవున్ని పరమతండ్రిగా పిలిచే ఆధిక్యతను పొందినవారు ఈలోకములో జీవించినంతకాలము లోకరక్షకుడైన ఇసా అల్-మసీహ్ చేసిన బోధల ప్రకారం అలాగే ఆయన చూపిన మాదిరిలో జీవించాలి. అంటే పొరుగువారిని ప్రేమించే, దూరస్థులను గౌరవించే, శత్రువులను దీవించే విధానములో ఎదగాలి. ఇది నిజదేవునికి ఇష్టమైన సేవ. ఈ జీవనవిధానములో కొనసాగుతున్నవారు చేసే ఆరాధనే నిజమైన ఆరాధన మరియు అది దేవునికి అంగీకారమైన ఆరాధన.

“మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.” (1యోహాను.2:3-4)

మూడవ అడుగు

నిజదేవుడు నిర్దేశించిన లోకరక్షకున్ని స్వీకరించాలి [Accept/Receive the Saviour of the World sent by true God]

సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన నరులను ప్రేమిస్తూ వారి ఉపదేశముకొరకు అనేకమంది ప్రవక్తలను నరులలోనుండి ఎన్నుకొని వారిద్వారా తన సందేశాలను మానవాళికి అందించాడు. ప్రవక్తల పరంపరద్వారా అందించబడిన సందేశాలలో తన చిత్తాన్ని తన ప్రణాలికను అలాగే తాను మానవాళి రక్షణకొరకు పంపబోవుతున్న లోకరక్షకుని గూర్చిన భవిశ్యవాణులను దేవుడు అందిస్తూ వచ్చాడు. దాదాపు 15 వందల సంవత్సరాల ఆ ప్రక్రియ చివరలో తాను సంకల్పించినవిధంగా తనలోని వాక్కును సశరీరునిగా ప్రతిష్టించి ఈలోకములోకి పంపించాడు.

దేవుని వాక్కు మనవాక్కులా ఒక వ్యక్తిత్వరహితమైన శబ్దం కాదు. నిజదేవునిలోని వాక్కు దైవత్వములోని వ్యక్తి! ఆ వ్యక్తి నరునిగా ఈలోకములో కన్యమరియకు జన్మించాడు. ఆయనే ఈసా అల్-మసీహ్! ఆయన ఈలోకములో ఒక నరునిగా, ప్రవక్తగా, అంతమాత్రమే కాకుండా అల్-మసీహ్ [ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు అభిషేకించబడినవాడు] గా జీవించి మానవాళి కొరకైన రక్షణ కార్యాన్ని నిర్వర్తించేందుకు దేవునిచేత పంపబడ్డాడు.

ఈసా అల్-మసీహ్ యొక్క జననం, జీవితం, శ్రమలు, మరణం మరియు మరణాన్ని జయించి తిరిగిలేవడంద్వారా నిజదేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరచే మానవులందరి పాపాలకు తగిన జరిమాన/శిక్షను చెల్లించాడు. ఇది మానవాళి యెడల సృష్టికర్త ప్రత్యక్షపరచిన దైవప్రేమ!

సాక్షాత్తు దైవప్రేమ యొక్క ప్రత్యక్షత అయిన ఈసా అల్-మసీహ్ ను మరియు ఆయనయందు దేవుడే నిర్వర్తించిన మోక్షకార్యాన్ని పాపియైన వ్యక్తి పశ్చత్తాపముతో విశ్వసించి స్వీకరించడమే దేవున్ని సంతృప్తిపరచి ప్రసన్నం చేసుకోవటం. ఇది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగే అతిప్రాముఖ్యమైన ప్రార్థనా మరియు నిర్ణయం. అలాంటివారే దేవునిచేత క్షమించబడి ఆత్మలో క్రొత్తగా జన్మించి దేవుని ప్రజలుగా మారుతారు. మరణానంతరం వారు దేవుని సన్నిధిలో దేవదూతలనుపోలి మహిమతో నిత్యమూ జీవిస్తారు. ఇది నీకూ అందించాలన్నదే దేవుని సంకల్పం. విశ్వాసముతో స్వీకరించు!

“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1తిమోతి.2:5-6)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే నాలుగవ అడుగు…

రెండవ అడుగు

నిజదేవుడు సిద్ధపరచిన మోక్షమార్గాన్ని విశ్వసించాలి [Blieve in the Salvation prepared by true God]

సృష్టికర్తయైన దేవుడు సహజసిద్ధంగా పరిశుద్ధుడు, న్యాయవంతుడు, మరియు ప్రేమాస్వరూపి. మానవకోటి అంతా తమ కార్యాలద్వారా, మాటలద్వారా, అంతేగాక తలంపులు/ఉద్దేశాలద్వారాకూడా దేవునికి వ్యతిరేకంగా పాపముచేసినవారే. అత్యంత పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎంత చిన్న పాపమైనా పెద్ద సమస్యే. మన పాపము (అంటే దేవునికి వ్యతిరిక్తమైనది) మనను పరిశుద్ధుడైన దేవునినుండి వేరుపరచింది. దేవుని న్యాయం మనపాపాలకు తగిన జరిమాన లేక శిక్షను నిర్ణయించింది. అది పరిశుద్దుడైన దేవునికి దూరంగా నరకాగ్నిలో నాశనమవడం.

లోకములో పాపరహితుడెవరూ లేరుగనుక అందరు నరకములో నాశనాన్ని శిక్షగా పొందబోతున్నారు. అయితే సృష్టికర్తయైన దేవుడు ప్రేమాస్వరూపి. ఈ కారణముచేత ఆయన అందరిని ప్రేమిస్తూ ఎవరు అంటే ఏపాపికూడా నరకములోకి ప్రవేశించడాన్ని ఇచ్చయించడు. అందునుబట్టి దేవుని ప్రేమ మానవులు తమ పాపాలకు పొందబోయే నరకశిక్షకు పరిష్కారాన్ని కనుగొని మానవులు ఆశిక్షలోనుండి తప్పించుకునే పరిష్కారమార్గాన్ని సిద్దపరచింది. ఇందుకుగాను దేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరుస్తూనే తన ప్రేమను ఋజువుపరచాడు. ఇందులో దేవుని న్యాయం, ప్రేమ, మరియు జ్ఙానం ద్యోతకమవుతున్నాయి.

దేవుడు సర్వశక్తిమంతుడు మరియు సార్వభౌముడు. దీని భావం ఆయన తన స్వభావానికి గుణలక్షణాలకుకూడా వ్యతిరేకంగా ప్రవర్తించగలడని కాదు. ఒక వేళ దేవుడు తన ప్రేమను బట్టి పాపులందరికి ఏజరిమానా లేక శిక్ష విధించకుండా ఒక్క మాటతో వారిని క్షమిస్తే తద్వారా ఆయన తన స్వభావలక్షణమైన న్యాయం/నీతికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. కనుక ఆయన అలా చేయడు చేయనేరడు. అలాచేయడమన్నది నిజదేవుని స్వభావానికే విరుద్ధమైనది.

మానవులందరి పాపాలకు దేవుని న్యాయం తగిన జరిమానను/శిక్షను నిర్దేశించించింది. దాని వెల ఊహలకందనిది. ఏ ఒక్క నరుడుగాని లేక నరుల సమూహముగాని ఆ వెలను తీర్చజాలదు. అందుకే దేవుడే ఊహాతీతమైన ఆ జరిమానను తన అపారమైన ప్రేమను బట్టి తానే భరించి దాని వెలను తాను చెల్లించాడు. ఈ విధానంలో నిజదేవుడు మానవాళికి పాపక్షమాపణను అందిస్తూ మోక్షమార్గాన్ని సిద్ధపరచాడు.

దేవుడే సిద్ధపరచిన మోక్షమార్గపు నెరవేర్పులో నరుల ప్రయత్నాలుగాని లేక పాలుపంపులుగాని లేవు. ఇది కేవలం దేవుని కార్యం. ఏనరుడు తన స్వనీతినిబట్టి లేక తన స్వంత మతనిష్టనుబట్టి పాపక్షమాపణను మోక్షాన్ని పొందజాలడు. అది దేవుని ఉచిత కృపావరము. కనుకనే ఏనరునికీ ఇందులో అతిశయించే ఆస్కారము లేదు!

దేవుడే తన నిత్య సంకల్పములో పథకరచన చేసి నిర్వర్తించి సిద్ధపరచిన క్షమాపణా పథకాన్ని విశ్వసించక దాన్ని తిరస్కరించిన వ్యక్తులందరు దేవుని క్షమాపణను అందుకోలేరు. అలాంటివారందరు తమ పాపాలన్నింటికి దేవుని న్యాబద్ధమైన జరిమాన/శిక్ష అన్నది రాబోవు తీర్పుదినాన నరకశిక్షద్వారా అందుకోబోతున్నారు. ప్రవక్త అయిన మూసా (మోషే) మరియు యితర ప్రవక్తల ద్వారా యివ్వబడిన దేవుని లేఖనాలలోని ధర్మం సూచిస్తున్న ప్రకారం ఒక వ్యక్తి తన తోటి నరునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు లేక అన్యాయాలకు రెండంతలు చెల్లించాలి (నిర్గ.కాం.22:4,7,9; యెషయా.40:2, 51:19; యిర్మీయ.16:18). అయితే, ఒక వ్యక్తి సృష్టికర్తకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు/అన్యాయాలకు ఎన్ని రెట్లు చెల్లించాలో నన్నది ఊహకు అందనిది. కనుకనే ప్రవక్త అయిన దావూద్ (దావీదు) ద్వారా యివ్వబడిన దైవలేఖనాలలోని వివరణ ప్రకారం అది ఎన్నటికీ తీరనిది (కీర్తన.49:9).

“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.” (రోమా.5:8-9)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మూడవ అడుగు…

మొదటి అడుగు

మొదటి అడుగు

నిజమైన అద్వితీయదేవున్ని విశ్వసించాలి [Blieve in the One true God]

సృష్టికర్త అయిన నిజదేవుడు సృష్టికి అతీతమైనవాడు మరియు సృష్టికి వేరైనవాడు. దేవుడు (אֱלֹהִ֑ים/Θεὸς/الله‎/God/) అన్న పదం అన్ని సమయాలలో సృష్టికర్తనే సూచించనవసరం లేదు. ఆ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి లేక గ్రంథము యొక్క దృష్టిపథంలో వున్న భావం మరియు గ్రహింపులే ఆ సందర్భములో ఆపదం సూచిస్తున్నదాన్ని నిర్వచించగలవు.     

‘ఏకైక దేవుడు’ అని పేర్కొన్నప్పటికి అది నిజదేవున్ని గురించి చెప్పబడిన మాట కానవసరము లేదు. ఏకదేవుడు/ఏకైకదేవుడు/ఒకేదేవుడు/ఒక్కదేవుడు వంటి పదజాలము అబద్ద దేవునికి లేక లేనిదేవునికి అంటే కేవలము మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమైన దేవునికి కూడా వాడబడుతున్నాయి ఈనాటి ధార్మిక ప్రయత్నాలలో. ఈ అత్యంత ప్రమాదకరమైన కారణాన్నిబట్టి నిజమైన అద్వితీయదేవున్ని మాత్రమే గుర్తించి విశ్వసించగలగాలి.          

నిజదేవుడు నిత్యుడు (Eternal), అనంతుడు (Infinite), స్వయంభవుడు (Self-Existent) మరియు అద్వితీయుడు (One). ఇవి దేవుని యొక్క తాత్విక గుణలక్షణాలుగా (Philosophical Attributes) చెప్పుకోవచ్చు. ఈ గుణలక్షణాలలో ఏది కొదవైనా అలాంటి దేవుడు నిజదేవుడు కాదు అన్నది సుస్పష్టం!  

పరిపూర్ణమైన పరిశుద్ధత (Holiness), న్యాయం/నీతి (Justice/Righteousness), మరియు ప్రేమ (Love) అన్నవి నిజదేవునికి వున్న నైతిక గుణలక్షణాలు (Moral Attributes). ఇందులో ఏగుణలక్షణం లేని దేవుడైనా అబద్ధ దేవుడైనా అయివుండాలి లేక మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమయిన దేవుడైనా అయివుండాలి.              

చివరగా, సర్వశక్తిమంతుడు (Omnipotent), సర్వజ్ఙాని (Omniscient), మరియు సర్వవ్యాప్తి (Omnipresent) అన్నవి నిజదేవుని సహజ గుణలక్షణాలు (Natural Attributes) అన్నది మరువకూడదు. ఈ గుణలక్షణాలులేని దేవున్ని పరిచయం చేసే ఏధార్మిక మార్గమైనా అసత్యమార్గమని ఇట్టే గుర్తించవచ్చు.

అనంతుడైన దేవుడు సర్వవ్యాప్తిగా వుండటం తధ్యం, అది అనిర్వార్యం. అలా సర్వవ్యాప్తిగా వుండలేని దేవుడు పరిధులుగల దేవుడు గనుక అలాంటి దేవుడు అనంతుడు కాదు, మరిముఖ్యంగా నిజదేవుడు కానేకాదు. నిజదేవుడు సర్వవ్యాప్తిమంతుడై వున్నా ఆయన సృష్టిని తగలకుండా సృష్టితో ఎలాంటి అనుసంధానము లేకుండా వున్నవాడు. అందుకే సృష్టికర్త ‘నేను ఉన్నవాడను’ అనువాడనై వున్నాను అంటూ తన ప్రవక్తకు తన నామమును వెల్లడిపరిచాడు. నిజదేవుడు వ్యాపించని స్థలము విశ్వములో ఎక్కడా లేదు. ఉనికిలోకి వచ్చిన ఈ విశ్వమంతా ఆయనలో సృష్టించబడింది. ఆయనకు బయట లేక వేరుగా వుండే స్థలమంటూ ఏదీ లేదు. ఆయనలో ఆయననుబట్టి ఉనికిని కలిగివున్నా అది ఆయనలోని భాగం కాదు కానేరదు. స్వయంభౌమత్వం అన్నది సృష్టికర్తకు మాత్రమే చెందిన ప్రవృత్తి. అది సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్యనున్న ఎప్పటికి తొలగని అగాధం! 

సృష్టికర్త అయిన దేవుడు తాను ఆశించిన రీతిలో తాను నిర్ధారించిన కాలములో సృష్టికి తనను తాను ప్రత్యక్షపరచుకోగల శక్తిసామర్థ్యమున్నవాడు. తన సంపూర్ణ మహిమాప్రభావాలతో కాకుండా సృష్టి వీక్షించగల స్థాయిలో తన ప్రత్యక్షతను అనుగ్రహించటమన్నది కేవలం నిజదేవునికే సుసాధ్యం. కాని, ఊహలకు మాత్రమే పరిమితమైన అబద్ద దేవునికి ఇది అసాధ్యం!

నిజదేవున్ని గుర్తించి విశ్వసించటమన్నది సరియైన దిశలో వేసే మొదటి అడుగు.

“…ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.” (మార్కు.12:29)

“దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు.2:19)

[పరిశుద్ధుడు: పవిత్రత, పరిపూర్ణత, మరియు ప్రత్యేకతల సమ్మేళణము కలిగినవాడు;
నిత్యుడు: ఆది అంతము లేనివాడు;
అనంతుడు: అపరిమితుడు; హద్దులు/పరిధులు లేనివాడు;
అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;]

గమనిక: దేవుడు (الله/God) అని సంబోధిస్తున్నా ఒకవేళ అది నిజదేవున్ని గురించి కాకపోతే ఆ సంబోధన అబద్ద దేవునికేనన్నది విస్పష్టం. అబద్ద దేవుడు రెండు రకాలుగా వుండే అవకాశముంది:

(అ) సృష్టించబడినదేదైనా లేక ఎవరైనా దేవునిగా సంబోధించబడితే అది అబద్ద దేవుడుగా లెక్కించబడుతుంది/లెక్కించబడుతాడు.
(ఆ) లేనిదేవుడు అంటే కేవళము మనుషుల ఊహలకే మాత్రమే పరిమితమైన దేవుడు కూడా అబద్ద దేవుడుగానే లెక్కించబడుతాడు.

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే రెండవ అడుగు…

అతి క్లిష్ట సందేహం!

ఒక ముస్లీముకొచ్చిన అతి క్లిష్టమైన సందేహం!

కొంతకాలం క్రితం ఒక ఇస్లామీయ వెబ్ సైటులో ఒక ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే ప్రశ్న. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప ఆ ప్రశ్నకు అర్థవంతమైన జవాబుగాని లేక తర్కబద్దమైన వివరణగాని ఇచ్చే ప్రయత్నం ఒక్కరుకూడా చేయలేదు. యదార్థంగా చెప్పలంటే ఆప్రశ్నకు ముస్లీములు జవాబు చెప్పలేకపోవడానికి కారణం వారికి జవాబు చెప్పే సత్తా లేక కాదు, కాని ఆ ప్రశ్నకు జవాబు చెప్పడమన్నది ఇస్లామీయ ధర్మం సత్యమని భావించే ఎవరివళ్ళా కాని పని అది. అయినా, ఈ ప్రశ్న కేవళము ఇస్లాము ధర్మాన్ని అనుసరించేవారికి మాత్రమే వర్తిస్తుందని అపోహపడకూడదు. ఇది ఆస్తిక వర్గానికి చెందిన అన్ని విశ్వాసాలకు వర్తించే ప్రశ్న. ఈ క్రింద యివ్వబడిందే ఆ ప్రశ్న:  

“ప్రస్తుతం నా అలోచనాసరళి గందరగోళంగా వుంది. ఒక వ్యక్తిని సృష్టించకముందే ఆ వ్యక్తి తన మరణానంతరం జన్నతుకు వెళ్ళబోతున్నాడా లేక నరకానికి వెళ్ళబోతున్నాడా అన్నది నిస్సంకోచంగా అన్నీ తెలిసిన (اَلْعَلِيْمُ/Al-Alim = All Knowing) అల్లాహ్ కు ముందే తెలుసి వుండాలి. అల్లాహ్ (الله‎/Allah) కు పైన వెరెవ్వరూ లేరు గనుక ఈ జ్ఙానం తనలోనుండే ఉద్భవించి ఉండాలి. అంటే, అలా జరగాలన్న నిర్ణయం అల్లాహ్ తానే చేసి వుండాలి. అయితే, అలాంటిది అల్లాహ్ కు వున్న రెండు నామాలతో పొసగలేదు: అనంత కరుణామయుడు (الرَّحِيمُ/Ar-Raheem = The Most Merciful) మరియు అత్యంత న్యాయవంతుడు (الْعَدْلُ/Al-Adil = The Most Fair/Just). ఒకవేళ ఒక ఫలాని వ్యక్తి సృష్టించబడితే ఆ వ్యక్తి తన మరణానంతరము నరకంలో నిత్యయాతనను అనుభవించబోతున్నాడు అన్న వాస్తవం అల్లాహ్ కు ముందే తెలిసి కూడా ఆవ్యక్తిని అల్లాహ్ సృష్టిస్తే ఇక అల్లాహ్ అనంత కరుణామయుడు ఎలా అవుతాడు…? ఒక అబ్దుల్లా విధిని నిత్యనరకంలో యాతనను అనుభవించాలని, ఒక అహ్మద్ విధిని జన్నతులో నిత్యసంతోషాలతో సుఖించాలని అల్లాహ్ *నిర్ణయిస్తున్నట్లయితే అల్లాహ్ అత్యంత న్యాయవంతుడెలా అవుతాడు…? అవును మనకు నిర్ణయస్వేచ్ఛ (Freewill) వుంది. కాని, అల్లాహ్ అన్నీ ముందే నిర్ణయించాడు కాబట్టి మన స్వేచ్ఛనుకూడా ఆయనే నియంత్రించడములేదని ఏలా చెప్పగలము…? ఈ ప్రశ్న నన్ను తీవ్రమైన మనస్థాపానికి మరియు కలతకు గురిచేస్తూ నా విశ్వాసానికే తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతున్నది!”    

పై సందేహానికి ముస్లీముగా మీ సమాధానమేమిటి…???

*[ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) మరియు హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)]

క్రైస్తవ విశ్వాసకోణంలోనుండి పై ప్రశ్నకు సమాధానం

దేవుడు – నిర్వచనం: సృష్టికర్త అయిన దేవుడు సర్వజ్ఙాని (Omniscient), సర్వవ్యాప్తి (Omnipresent), మరియు సర్వశక్తిమంతుడు (Omnipotent) [సహజ లక్షణాలు]. సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు (Infinite), నిత్యుడు (Eternal), మరియు స్వయంభవుడు (Self-existent) [తాత్విక లక్షణాలు]. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు (Holy), న్యాయవంతుడు (Just), మరియు ప్రేమాస్వరూపుడు (Love) [నైతిక లక్షణాలు]. 

దేవుడు సర్వజ్ఙాని – వివరణ: జ్ఙానమంతా దేవునిది. వున్న జ్ఙానమంతా దేవుని వశం. తెలియబడగలిగినదంతా దేవునికి తెలిసు, కాని తెలియబడజాలనిది ఆయనకూడా తెలియదు! మరొక నిజమైన దేవున్ని సృష్టించడమెలాగో దేవునికి తెలియదు; తననుతాను నిర్మూలముచేసుకోవడమెలోగో దేవునికి తెలియదు; పాపము చేయడము అంటే తనకుతాను వ్యతిరేకముగా ప్రవర్తించడము, తానే ఎత్తలేని రాతిని సృష్టించడము, త్రిభుజవృత్తాన్ని రూపించడం, ఒకే వైపు వున్న నాణ్యాన్ని  తయారుచేయడం మొదలైనవి దేవునికి తెలియవు. దీనికిగల ప్రధాన కారణం ఇవన్నీ అర్థవంతమైన లేక తర్కబద్దమైన మాటలు కాదు. వీటి భావాన్ని ఊహించుకోవడముకూడా అసాధ్యమైన విశయం. ఇలాంటివాటిని తర్కశాస్త్రములో అంతర్గత అసాధ్యాలు (Intrinscically Impossible Things) అని పేర్కొంటారు. ఈ గ్రహింపును బట్టి నిజదేవునికి అన్నీ తెలుసు అంటే తెలిబడగలిగినవన్నీ ఆయనకు తెలుసు అని అర్థం. అంతర్గత అసాధ్యాలు లేక అర్థంలేనివి దేవునికి తెలియవు. అవికూడా దేవునికి తెలిసుంటాయి లేక తెలిసుండాలి అని భావించడం అజ్ఙానం. అస్తిత్వాలను మూడురకాలుగా విభజించవచ్చు–తప్పనిసరి అయిన అస్తిత్వం [స్వయంభవుడైన దేవుడు (Necessary Being)], సుసాధ్యమైన అస్తిత్వం [ఉనికిలోకి రావచ్చు మరియు ఉనికిలోనుండి వెళ్ళిపోవచ్చు (Possible Being)], మరియు అంతర్గతంగా అసాధ్యమైన అస్తిత్వం [వీటికి ఎక్కడా ఎప్పుడూ ఉనికిలేదు (Intrinscically Impossible Being)].        

సుసాధ్య అస్తిత్వాలన్నవి ఆధారభరిత అస్తిత్వాలు (Contingent Beings). అవి తప్పనిసరి అయిన అస్తిత్వంపై అంటే దేవునిపై ఆధారపడేవి. సుసాధ్య మైన వాటి ఉనికిని దేవుడు ఉద్దేశించి సృష్టించగలడు. దేవుడు ఉద్దేశించి సృష్టించగలిగేవన్ని తెలుసుకోబడగలిగేవి. కనుక, దేవుడు తాను ఉద్దేశించి సృష్టించిన అన్నింటిని–పదార్థం, సంఘటనలు, వ్యక్తులు, పాత్రలు, వస్తువులు మొదలైనవి–గురించిన జ్ఙానం ఉన్నవాడు.   

భవిశ్యత్తు విశయానికొస్తే, దేవుడు తాను ఉద్దేశించి పథకరచన చేసిన వాటన్నింటిని ఎరిగినవాడు, కాని ఆయన  ఉద్దేశించనివి ఆయన తలంపులోకూడా ఉనికినికలిగిలేవు గనుక అలాంటివాటిని ఆయన ఎరుగడు అన్నది ఇక్కడ మరవకూడదు.     

భ్యవిశ్యత్తు – వివరణ: భవిశ్యత్తు అన్నది ప్రస్తుతం ఒక వాస్తవ అస్తిత్వముగా ఉనికిలో లేదు. అది రాబోవు కాలములో వాస్తవ అస్తిత్వముగా ఉంటే దాని సృష్టికర్త దేవుడే అన్నది నిరాపేక్షమైన అంశం. కనుక తాను ఉద్దేశించి పథకరచన చేసిన భ్యవిశ్యత్తును తాను ఏవిధంగా ఉద్దేశించి పథకరచన చేసాడో అదేవిధంగా భవిశ్యత్తును దేవుడు ఎరుగును. భవిశ్యత్తులో నిర్ణయస్వాతంత్రము వున్న ప్రాణులను (నరులు మరియు దేవదూతలు) అంతేకాకుండా ఆ ప్రాణుల నిర్ణయాలను చర్యలను కూడా దేవుడు నిర్ధారించవచ్చు. అప్పుడే ఆయన వాటినికూడా ఎరిగడము అన్నది జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ దేవుడు తాను ఉద్దేశించి పథకరచనచేసిన నిర్ణయస్వేచ్చగల ప్రాణుల యొక్క నిర్ణయాలను, చర్యలను తాను నిర్ధారించకుండా విడిచిపెడితే వాటిని ఆయన ఎరుగడు. ఆరంకంగా భవిశ్యత్తులోని నిర్ణయస్వేచ్చగల ప్రాణుల నిర్ణయాలను చర్యలను అంతేకాకుండా కొన్ని సంఘటనలను కొన్ని పాత్రధారులనుకూడా ఆయన తాను నిర్దేశించకుండా వదిలిపెట్టే స్వాతంత్రము ఆయనకుంది. ఆరకంగా చేసిన సందర్భాలలో దేవుడు వాటిని ఎరుగడు.   

భవిశ్యత్తుకు సంబంధించిన వాటిలోని ఏవైనా దేవుడు నిర్ధారించకుండా వదిలిపెడితే అలాంటి శూన్య స్థానాలు వాటిసమయం సమీపించినప్పుడు దేవునిచేత లేక నిర్ణయస్వేచ్చగల ప్రాణులచేత పూరింపబడవచ్చు. ఆ శూన్య స్థానాలలో తెలుసుకోవడానికిగాని లేక తెలుసుకోబడగలిగేవిగాని ఏమీ లేవు. కనుక, వాటినిగూర్చిన జ్ఙానం దేవునికి ఉందా? అన్న ప్రశ్న అర్థములేని ప్రశ్న లేక అజ్ఙానపు ప్రశ్న. దేవునిచేత (సార్వభౌమత్వాన్నిబట్టి) లేక నిర్ణయస్వేచ్చగల (దేవుడిచ్చిన నిర్ణయస్వేచ్చనుబట్టి) ప్రాణులచేత నిర్ధారించబడే వరకు ఆ శూన్య స్థానాల యొక్క భవిశ్యత్తులోని వాస్తవికత అన్నది దేవుడు ఎరుగడు. 

ఒక వ్యక్తి మరణానంతరము నరకానికి వెళ్ళబోతున్నాడా లేక పరలోకానికి (జన్నత్) వెళ్ళబోతున్నాడా అన్నది దేవునికి ముందే తెలుసా? తెలియదు! కారణం, అది తెలిసుకునే అవకాశం లేదు. అంటే దేవుడైనా లేక ఆ వ్యక్తి అయినా దాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఒకవేళ దేవుడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి అని నిర్ధేశిస్తే అప్పుడే దేవుడు దాన్ని ఎరుగడం అన్నది సాధ్యం. అలాంటి నిర్ణయం అంటూ దేవుడు చేస్తే దాన్నిబట్టి ఆయన అన్యాయస్థుడు, ప్రేమలేనివాడు, మరియు చెడ్డవాడు అని అర్థంచేసుకోవాల్సి వస్తుంది. కాని, దేవుడు అలాంటివాడు కాదు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా అలాంటిది ఎప్పుడు చేయడు చేయజాలడు (హెబ్రీ.10:). కనుక పరలోకానికి వెళ్ళడమా లేక నరకానికి వెళ్ళడమా అన్న నిర్ణయాన్ని దేవుడు నిర్ణయస్వేచ్చతోకూడిన నరులందరికీ యిచ్చాడు. అందుచేత ప్రతివ్యక్తి తనకివ్వబడిన నిర్ణయస్వేచ్చనుబట్టి తలంపులద్వారా, మాటలద్వారా, మరియు చేతలద్వారా నిత్యత్వములో తాను ఎక్కడ ఉండబోతున్నది నిర్ధారించడం జరుగుతుంది. 

దేవునికి భవిశ్యత్తు తెలుసు అంటే దాని భావం దేవుడే భవిశ్యత్తు అలా వుండాలని నిర్ధేశించాడని. కనుక, ఇస్లాము ధర్మము ప్రకారం ఏవ్యక్తులు నరకానికి వెళుతునారోనన్నది అల్లాహ్ కు ముందే తెలుసు అన్నది వాస్తవమైతే దాని అర్థం ఆ వ్యక్తులు నరకానికి వెళ్ళడమన్నది అల్లాహ్ యే నిర్ధేశించాడని. నిజానికి ఇస్లామీయ సాహిత్యములో అంటే ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) ముఖ్యంగా హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)] ఈ భావాన్నే వ్యక్తపరుస్తున్నాయి. అయితే అలాంటి దేవుడు నిజదేవుడు కానేరడు. కారణం, అలాంటి దేవుడు న్యాయం మరియు ప్రేమ లేనివాడు మాత్రమేగాక అతను అతిగొప్ప దుష్టత్వానికి ప్రతిరూపం అన్నది అర్థమవుతుంది. అదృష్టవశాత్తు అలాంటి దేవుడు కొందరి ఊహాగానాలలో తప్ప అస్తిత్వంతోకూడిన ఉనికిలో లేడు. నిజానికి దైవగ్రంథమైన బైబిలు అలాంటి జ్ఙానాన్ని దేవునికి ఎక్కడా ఆపాదించడంలేదు. 

న్యాయం – వివరణ: దేవుడు తన సార్వభౌమత్వములో తన నిర్ణయస్వేచ్చను తొలగించుకోవడంద్వారా మనుషులకు (మరియు పరలోకములోని దేవదూతలకు) నిర్ణయస్వేచ్చను [freewill] అనుగ్రహించాడు. ఆరకంగా తన నిర్ణయస్వేచ్చను తొలగించుకునే అధికారం మరియు స్వేచ్చ అన్నవి దేవుని సార్వభౌమత్వములోని భాగం. ఆరకంగా ఇవ్వబడిన సంపూర్ణ నిర్ణయస్వేచ్చ వున్న సందర్భాలలోనే వ్యక్తులు తమ నిర్ణయాలకు మరియు చర్యలకు బాధ్యతవహించి తీర్పుతీర్చబడుతారు. పక్షపాతరహితంగా నిర్ణయస్వేచ్చ కలిగి వున్న వ్యక్తులను వారి నిర్ణయాలు మరియు చర్యల ఆధారంగానే వారికి తగినవిధంగా తీర్పుతీర్చడమన్నది ఇక్కడ న్యాయం అని గ్రహించాలి. శిక్షకు తగిన నేరం చేయకపోయినా శిక్షించడమన్నది అన్యాయం; చేయబడిన నేరానికి తగిన శిక్ష విధించకుండా క్షమించినా అది అన్యాయం (సామెతలు.17:15).                 

ప్రేమవివరణ: దేవుని నైతిక లక్షణాలు పరిశుద్ధత (యెషయా.6:1-3; ప్రకటన.4:8), న్యాయం (ద్వి.కాం.32:4; యెషయా.30:18; కీర్తన.89:14), మరియు ప్రేమ (ని.కాం.34:6; 1యోహాను.4:8,16). ఎవరూ నశించడము దేవుడు యిచ్చయించడు (1తిమోతి.2:3-6; యోహాను.3:16; రోమా.5:8) అన్నదానికిగల కారణము దేవుని ప్రేమ. ఈ లోకములో చేయబడిన పాపాలన్నింటికీ తగిన శిక్ష/వెలను కోరేది దేవుని న్యాయం. యదార్థంగా తమ పాపాలకు పశ్చాత్తాపపడి విశ్వాసముతో దేవుని సహాయము కోరేవారందరినీ రాబోవు తీర్పుదినాన కాపాడేనిమిత్తం దేవుడే తన నిత్యసంకల్పములోని ప్రణాలికనుబట్టి తన న్యాయం మరియు ప్రేమల ఆధారంగా పథకరచననుచేసి దాన్ని తానే నిర్వర్తించి మానవాళికి రక్షణ/మోక్షం సంపాదించిపెట్టాడు (ని.కాం.34:7; కీర్తన.145:9; అ.కా.10:34-35; రోమా.11:32; తీతుకు.2:11, 3:4; 1యోహాను.4:9-10). దేవుడే సంపాదించిపెట్టిన ఈ రక్షణ/మోక్ష మార్గాన్ని సిద్దపరచి దానికి తగిన వెల చెల్లించిందది దేవుడే (రోం.5:6-8; 18; 1యోహాను.2:1-2). మరొక విధంగా చెప్పాలంటే, దేవునిన్యాయం కోరిన వెలను దేవునిప్రేమ చెల్లించింది. ఏనరుడు తన పాపాలకు తగిన వెలను చెల్లించి మోక్షాన్ని/రక్షణను అంటే పాపక్షమాపణ మరియు నిత్యజీవము సంపదించలేడు (కీర్తన.49:7-9). రక్షణ లేక మోక్షము అన్నది దేవుడు తన కృపనుబట్టి అనుగ్రహిస్తున్న ఉచిత బహుమానము. దాన్ని కేవళము విశ్వాసముతోనేఅ అందుకోగలము (ఎఫెసీ.2:8-9).

బైబిలు (పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాలు) లో ప్రత్యక్షపరచుకున్న దేవుడు మరియు ఆయన గుణలక్షణాలే పై ప్రశ్నకు సరియైన సమాధానము. ఆయన  మాత్రమే గందరగోళంగా వున్న హృదయాలకు తన సత్యంతో సమాధానం అనుగ్రహించగలడు. దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యంలోకి నడిపించును గాక!    

« Older Entries