మూడవ అడుగు

నిజదేవుడు నిర్దేశించిన లోకరక్షకున్ని స్వీకరించాలి [Accept/Receive the Saviour of the World sent by true God]

సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన నరులను ప్రేమిస్తూ వారి ఉపదేశముకొరకు అనేకమంది ప్రవక్తలను నరులలోనుండి ఎన్నుకొని వారిద్వారా తన సందేశాలను మానవాళికి అందించాడు. ప్రవక్తల పరంపరద్వారా అందించబడిన సందేశాలలో తన చిత్తాన్ని తన ప్రణాలికను అలాగే తాను మానవాళి రక్షణకొరకు పంపబోవుతున్న లోకరక్షకుని గూర్చిన భవిశ్యవాణులను దేవుడు అందిస్తూ వచ్చాడు. దాదాపు 15 వందల సంవత్సరాల ఆ ప్రక్రియ చివరలో తాను సంకల్పించినవిధంగా తనలోని వాక్కును సశరీరునిగా ప్రతిష్టించి ఈలోకములోకి పంపించాడు.

దేవుని వాక్కు మనవాక్కులా ఒక వ్యక్తిత్వరహితమైన శబ్దం కాదు. నిజదేవునిలోని వాక్కు దైవత్వములోని వ్యక్తి! ఆ వ్యక్తి నరునిగా ఈలోకములో కన్యమరియకు జన్మించాడు. ఆయనే ఈసా అల్-మసీహ్! ఆయన ఈలోకములో ఒక నరునిగా, ప్రవక్తగా, అంతమాత్రమే కాకుండా అల్-మసీహ్ [ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు అభిషేకించబడినవాడు] గా జీవించి మానవాళి కొరకైన రక్షణ కార్యాన్ని నిర్వర్తించేందుకు దేవునిచేత పంపబడ్డాడు.

ఈసా అల్-మసీహ్ యొక్క జననం, జీవితం, శ్రమలు, మరణం మరియు మరణాన్ని జయించి తిరిగిలేవడంద్వారా నిజదేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరచే మానవులందరి పాపాలకు తగిన జరిమాన/శిక్షను చెల్లించాడు. ఇది మానవాళి యెడల సృష్టికర్త ప్రత్యక్షపరచిన దైవప్రేమ!

సాక్షాత్తు దైవప్రేమ యొక్క ప్రత్యక్షత అయిన ఈసా అల్-మసీహ్ ను మరియు ఆయనయందు దేవుడే నిర్వర్తించిన మోక్షకార్యాన్ని పాపియైన వ్యక్తి పశ్చత్తాపముతో విశ్వసించి స్వీకరించడమే దేవున్ని సంతృప్తిపరచి ప్రసన్నం చేసుకోవటం. ఇది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగే అతిప్రాముఖ్యమైన ప్రార్థనా మరియు నిర్ణయం. అలాంటివారే దేవునిచేత క్షమించబడి ఆత్మలో క్రొత్తగా జన్మించి దేవుని ప్రజలుగా మారుతారు. మరణానంతరం వారు దేవుని సన్నిధిలో దేవదూతలనుపోలి మహిమతో నిత్యమూ జీవిస్తారు. ఇది నీకూ అందించాలన్నదే దేవుని సంకల్పం. విశ్వాసముతో స్వీకరించు!

“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1తిమోతి.2:5-6)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే నాలుగవ అడుగు…